గోదావరి అందాల మధ్యన 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న మధుమతి
కడియం రమేష్ సమర్పణ లో శివ కుమార్ , ఉదయ భాను హీరో హీరోయిన్ గా రాజ్ శ్రీధర్ దర్సకత్వం లో గోమాత ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై రాణి శ్రీధర్ నిర్మిస్తున్న మధుమతి చిత్రం 50 శాతం షూటింగ్ గోదావరి అందాల మధ్య న చిత్రీకరించడం జరిగింది.
మధుమతి సినిమా గురించి దర్శకుడు రాజ్ శ్రీధర్ మాట్లాడుతూ నేను ఉదయభాను ని ద్రుష్టి లో పెట్టుకుని ఈ కథని 8 సంవత్సరాలు ముందే తాయారు చేసుకోవడం జరిగింది . విచలవిడిగా తిరిగే ఒక తెలుగు అమ్మాయి ని అనుకోని పరిస్థిలో తమిళ అభాయి తన ఇంటికి తీసుకొని వెళ్ళడంతో ఎదురయే పరిణామాలు ను తనకి అనుగుణము ఎలా మలుచుకున్నాడో అన్నది ఈ చిత్ర కథ . ఈ సినిమా ని పూర్తి హాస్యభరితంగా మరియు కుటుంభసమేతముగా చూడదగిన చిత్రం గా చిత్రికరిస్తునాం అలాగే ఈ సంవత్సరం గాను మా మధుమతి సినిమా ద్వారా ఉదయభాను ఉతమ నటిగా ఖచితముగా అవార్డు తీసుకుంటుంది అని అన్నారు .
చిత్ర సమర్పకులు కడియం రమేష్ మాట్లాడుతూ మా మధుమతి సినిమా మొత్తం గోదావరి బ్యాక్ డ్రాప్ లో చిత్రికరించము . మార్చ్ మొదటి వారంలో షూటింగ్ మొదలపెట్టి మే 18 వరకు 50 శాతం షూటింగ్ పూర్తి చేసాం. మేము మధుమతి క్యారెక్టర్ ని ఎలా అయితే ఊహించుకునమో ఆ పాత్రకి ఉదయభాను ప్రాణం పోసిందని చెప్పగలను . ఈ పాత్ర ద్వారా అలనాటి సావిత్రి నిన్నటి జయసుధ గార్ల కోవలో ఉదయభాను నిలవడమే కాక మా మధుమతి సినిమా కి మంచి గుర్తింపుని తీసుకోస్తుది అని ఆసిస్తునాము అని అన్నారు .
ఈ చిత్రానికి ఫోటోగ్రఫి - సత్య వి ప్రభాకర్ , సంగీతం - రాజ్ కిరణ్ , నిర్మాణం - రాణి శ్రీధర్ , కథ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్శకత్వం - రాజ్ శ్రీధర్

share